♦️ *మోడీకి కలలో అయోధ్య రాముడెందుకు చెప్పలేదూ?*
May 23, 2024 11:44 pm
ప్రజలు వాస్తవమైన ఆనందం ఏమిటో గ్రహించిన రోజున, ఆ ఆనందాన్ని పొందడం సాధ్యమేనని తెలుసుకున్న రోజున, మతం అదృశ్యమౌతుంది- అయితే, పాలకవర్గాలు తమ ప్రయోజనాల రీత్యా- ప్రజలు అసలు విషయం తెలుసుకోకుండా అడ్డుపడు తుంటారు. తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మతాన్ని ఉపయోగించుకుంటారు.
– ఆగస్ట్ బెబెల్, రచయిత, వక్త, జర్మన్ సోషలిస్ట్ రాజకీయవేత్త.
తెలివిగలవాడికైతే వాడి మెదడు పనిచేస్తుంది. తెలివిలేనివాడికైతే వాడి నాలుక పనిచేస్తుంది – అనే మాట ఉంది. తెలివిగల నాయకుడే కదా సకారాత్మకమైన నిర్ణయాలు తీసుకుని, ఒకవైపు ప్రజా సంక్షేమం మీద, మరోవైపు అభివృద్ధి మీద దృష్టి పెడతాడూ? అవి చేయలేని నాయకుడు మన్కీ బాత్ పేరిట నాలుకను తెగ ఉపయోగిస్తాడు. కోతల పురాణం వినిపిస్తాడు. అది పదేండ్ల పాటు విన్న ఈ దేశ ప్రజలు తమకు రవ్వంతైనా లాభం చేకూరిందా?- అని ఆలోచనలో పడ్డారు! ఒక సంప్రదాయవాదుల ఇంట్లో నామకరణ మహోత్సవం జరుగుతూ ఉంది. పురో హితుడు పిల్లవాడికి ‘నరేంద్ర’ అనే పేరు పెట్టమని సూచించాడు. పక్కన ఓమూల కూర్చున్న పిల్లవాడి నానమ్మకు దు:ఖం ఆగలేదు. బోరున ఏడ్చింది. ”ఏందమ్మా? ఏమైందీ?”- అని అందరూ ఆత్రంగా అడిగారు. ”నా మనవడు ఇక ఎప్పుడూ నిజం మాట్లాడలేడు కదా?- అని ఏడుపొచ్చింది!” – అని చెప్పింది. పురోహితుడు తలవంచుకున్నాడు. బంధువులంతా పగలబడి నవ్వారు.
ఒక బఫూన్ (హాస్యగాడు) రాజు మందిరంలోకి ప్రవేశించినంత మాత్రాన అతను రాజు కాలేడు. కానీ, రాజమందిరమే సర్కస్ అవుతుంది-అనేది ఒక టర్కిష్ సామెత. ఇది మన దేశంలో ఎవరికి వర్తిస్తుందో ఈ దేశ ప్రజలకు తెలుసు. చిత్ర విచిత్ర వేషధారణలతో జనాన్ని ఆకర్షించాలనుకునే వాడు-ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీనే! ఆయన కాలంలో విదేశాల్లో దేశానికి ఉన్న పరువుపోయింది. దేశంలో కరువు పెరిగింది. ధర్మ వ్యాధి గ్రస్తుడయిన అధర్మ పాలకుడుగా ఆయన చరిత్రలో మిగిలి పోయాడు. పెద్దనోట్ల రద్దు కాలంలో ఒక పెద్దాయన ఇలా అన్నాడు. ‘మాటిమాటికీ నోట్లు మార్చుకునే బదులు, ఒక్కసారే ప్రభుత్వాన్ని మార్చుకోవడం మేలు’ – అని! ఈ దేశ ప్రజలు ఎప్పటినుండో అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు మార్చుకునే సమయం రానే వచ్చింది.
ఇటీవల ఈ దేశ ప్రధాని తాను విలేకరుల సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయడో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో బట్టబయలు చేశాడు. సోషల్ మీడియాలో అబద్దపు వార్తలు ప్రచారమవుతున్నాయనీ, అందుకని తాను ప్రెస్మీట్లు పెట్టడం లేదని సెలవిచ్చారు. వంద ఎలుకల్ని మింగిన పిల్లి సత్యవచనాలు ప్రవచించినట్టుగా ఉందా వివరణ. పైగా ఆయన ఈ దేశ ప్రజల్ని కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. తప్పుడు వార్తల్ని నమ్మొద్దన్నాడు. బాగానే ఉంది కానీ, నాలుగు వేల ఐటి ఉద్యోగులతో ఐటిసెల్ ఏర్పాటు చేసి తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు రోజూ వేలకు వేలు దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న పార్టీ ఏది తండ్రీ? ముందా విషయం చెప్పు అని అడిగేవాడు లేకనే కదా? ఇలాంటి పనికి మాలిన వివరణలూ? సరే, ఆ విషయం అలా ఉండనివ్వడి. ”బీజేపీ- ఆవు- రాముడు- మధుర- కాశీ- కబ్రస్థాన్- పాకిస్థాన్- శ్మశాన్- తాలిబన్ల మీద ఆధారపడి ఇంకా ఎంత కాలం ఎలక్షన్లు గెలుస్తుందీ? అసలు ఎప్ప టికైనా తమ స్వంత బలం మీద గెలుస్తుందా?”- అని ప్రశ్నిం చాడు ప్రసిద్ధ జర్నలిస్ట్ అశోక్ వాంఖ్డే.
భారత సైన్యంలో మూడు వేల అగ్నివీర్లను నియుక్తం చేయడానికి అప్లికేషన్లు ఆహ్వానిస్తే తొమ్మిది లక్షల యాబై అయిదు వేల నిరుద్యో గులు అప్లికేషన్ పెట్టు కున్నారు. దేశం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో ఎంత దయ నీయమైన స్థితిలో ఉందో చెప్పుకొవాలంటే మన ముందు ఇలాంటి ఎన్నో సంఘటనలున్నాయి. ఇలాంటి విషయాలేవీ పట్టించుకోకుండా. ”మనమంతా కలిసి అమృత్ మహోత్సవంలో పాల్గొందాం!” అని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే బీజేపీ ప్రభుత్వ పెద్దలకు, బాధ్యులకు కండ్లు మూసుకుపోయాయా ? దేశ పరిస్థితులేవీ కనిపించడం లేదా? అని ఈ దేశ ప్రజలు ఆందోళన పడుతున్నారు. వీరిది ఎంతగొప్ప పరిపాలనో చెప్పుకోవడా నికి మరొక సంఘటన చూడండి- మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా పత్రం సమర్పిద్దామని వెళుతూ ఉంటే, ఆయన మద్దతుదారులు ఆయన రాజీ నామా పత్రాన్ని ఆయన నుండి లాక్కుని చింపేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే ఇక, సామాన్యుల సంగతేమిటీ? వెంటనే అక్కడ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి కదా? చేశాడా? బీజేపీ వారి పాలన ఆ విధంగా సాగిందన్నమాట!
”జ్ఞానవంతుడు తన శత్రువులను ప్రేమించడమే కాకుండా తన స్నేహితులను ద్వేషించనూగలడు” అని అన్నాడు జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే. ఆ మాట అర్థం చేసుకోగలిగే స్థాయి ఆరెస్సెస్ బీజేపీలకు ఎక్కడుందీ? ప్రశ్నించిన వారిని జైల్లో తోయడమో లేక చంపేయడమో చేస్తున్న మోడీ ప్రభుత్వానికి అంతకన్నా లేదు. పదేండ్లుగా చూస్తూనే ఉన్నాం కదా? ”మనిషి అత్యంత క్రూర జంతువు’ – అని కూడా అన్నాడు. మరో సందర్భంలో ఫ్రెడరిక్ నీషే. గుజరాత్, మణిపూర్ మారణ కాండలు జరిపించిన మోడీ- షాల గురించే చెప్పాడా నీషే? కాదు. ఆయనె ప్పుడో ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్పాడు. ఇక్కడ మన దేశ నాయకులు దాన్ని నిజం చేసి చూపారు. ఇటీవల ఒక లోక్సభ ఎన్నికల ర్యాలీలో మాట్లా డుతూ దేశ ప్రధాని ఇలా అన్నాడు. ”కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయం పైకి బుల్డోజర్లు పంపి కూలగొడతారు” -అని! గతంలో ఆలయాలను కూల్చిన రికార్డు ఆ పార్టీకి లేదు. కానీ, ఉత్తరప్రదేశ్లో పేద ముస్లింల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపిన గొప్ప సంప్రదాయం బీజేపీ – యోగి ప్రభుత్వానికి ఉందని ఈ దేశ ప్రజలకు తెలియదా? ప్రజల చెవుల్లో బీజేపీ వారు కమలం పూలు ఏనాటికీ పెట్టలేరు. వాళ్లు పెడతామన్నా ప్రజలు పెట్టించుకోరు. ముస్లిం మహిళలు చేపట్టిన షహీన్బాగ్ ఉద్యమం తక్కువదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి! వంటచేసి టిఫిన్ బాక్స్లు పెట్టి పిల్లల్ని స్కూలుకు పంపే మహిళలు, భర్తల్ని ఆఫీసులకు పంపే మహిళలు, రాజకీయాలు అంతగా తెలియని మహిళలు రోడ్డెక్కి షహీన్బాగ్లై విస్తరిం చారు. నిరసన గళాల్ని బలంగా వినిపిం చారు. నియంతలమని అనుకున్న వాళ్లంతా ఊడిపోయే ‘ఖాకీ నిక్కర్లు’ పట్టుకుని పరుగులు తీశారుకదా?
అది అలా ఉండనిచ్చి, రైతుల నల్లచట్టాల్ని ఈ దేశంలో రైతులు ఎలా తిప్పికొట్టారో చూశాం. వృద్ధులు, యువకులు పొలం పనులు మానుకుని, నిద్రాహారాలు మానుకుని నిరసన నినాదాలు చేస్తే-అవి ఢిల్లీ దాకానే కాదు. ప్రపంచ దేశాలన్నిటికీ వినిపించాయి. బీజేపీ ప్రభుత్వం తోకముడిచి నల్లచట్టాల్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దేశానికి తిండి పెట్టే రైతుల మీద మోడీ ప్రభుత్వం బుల్లెట్లు కురిపిస్తుందా? వారి దారిలో మేకులు కొట్టిస్తుందా? ఏడు వందల మంది రైతుల ప్రాణాలు తీసి మోడీ ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రజలు ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ క్షమించరు. గుజరాత్, మణిపూర్ మారణకాండలు జరిపించిన మోడీ-షాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నారు. మనుషులుగా కూడా మిగిలిలేరు. అయినా, జడ్జిని చంపించిన వాడిని దేశ హోంమంత్రిగా చేసుకోవడమా? ఎంత అమానవీయం? ఎంత అమానుషం? రచయితల్ని. ఆలోచనా పరుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని చంపించి, లేదా జైళ్లలోకి తోయించి రాజ్యమేలుతామనుకుంటే ఎలా? ప్రశ్నను ఎవడూ అణిచివేయలేడని తెలుసుకోని బుద్దిహీనులు అహంకారంతో ప్రవర్తిస్తే ఏమవుతుందీ? ఆలస్యమవుతుంద ేమోగానీ, చివరికి మట్టి కరవాల్సిందే తప్పదు!
ఇది హిందూ దేశమని అంటున్నారు కదర్రా? హిందూ దేవీ దేవతలు శక్తిమంతులని భ్రమిస్తున్నారు కదర్రా? మరి ఈ దేశాన్ని ఈ దేవుళ్లు వందల ఏండ్లు ముస్లింలకూ, క్రైస్తవులకు ఎందుకు అప్పగించినట్లూ? విశాలమైన హిందూ దేశాన్ని లోగడ ఏ హిందూ రాజు పరిపాలించాడూ? కాస్త చరిత్ర పుస్తకాల దుమ్ము దులిపి చదువుకోండి. విశాలమైన భారత సామ్రాజ్యాన్ని పరిపాలించింది బౌద్ధ చక్రవర్తి ఆశోకుడు ఒక్కడే! మరి ఆ స్థాయి హిందూ రాజు ఎందుకు లేడూ? ఉన్నా ఎవరో కొందరు చిన్నా చితక రాజులున్నారు తప్ప, ఆ స్థాయి చక్రవర్తులే లేరు కదా? అయినా చదువుకున్న వారికి విషయాలు తెలుస్తాయి.
దొంగ సర్టిఫికెట్లు సంపాదించుకున్న వారికి దొంగ మాటలే వస్తాయి. ఈ బీజేపీ పాలకులు హిందూ హిందూ అని అంటూ ఉంటే దేశంలోని హిందువులకే అసహ్యం వేస్తోంది. ఏదైనా అతి చేయకూడదు కదా? మోడీ స్కాంలలో అయోధ్య రాముడు కూడా ఒక స్కామే! ఇంత అశక్తుడైన అయోధ్య రాముణ్ణి ఈ దేశ ప్రధాని ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టూ? బూచీ- అని పిల్లల్ని భయ పెట్టినట్టు ఈయన రాముణ్ణి చూపించి ప్రజలను భయపెడుతున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. స్కాం అంటే కుట్ర- మోసం. అధిక సంఖ్యలో ప్రజలు నమ్ము తున్నారు కదా అని మోసపూరితంగా రాముణ్ణి రాజకీయాల్లోకి లాగి, జనాన్ని మోసపుచ్చడం స్కామ్కాక మరేమిటీ? అయోధ్య రామాలయం సర్వరోగ నివారిణి అనుకుంది మోడీ ప్రభుత్వం.
అయోధ్య రాముడికి అన్ని మహిమలే ఉంటే, వాటిని ఉపయోగించి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పించాలి కదా? రైతుల సమస్యకు, పౌరసత్వ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి కదా? పడిపోయిన రూపాయి విలువను హంగర్ ఇండెక్స్లో స్థానాన్ని గణనీయంగా పెంచు కోవాలి కదా? మన ప్రధానికి రాముడు కలలో కనిపించి మతాల వారిగా జనాన్ని విడగొట్టమ న్నాడా? అవినీతి పరులైన వారినందరినీ తమ పార్టీ వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కోమన్నాడా? అయోధ్య రాముడు కలలో కనిపిం చి మోడీకి ఏం చెప్పాడు? మన ప్రజలకి తెలియాలి! – సృష్టికర్త, శక్తిమంతుడు అని చెప్పే ఆ దేవుడికి అందరినీ కలిపి ఉంచగలిగే శక్తి లేదా? ఆ ఆయోధ్య రాముడి ఆశీస్సులతో ఈ బీజేపీ ప్రభుత్వ పెద్దలు భారత రాజ్యాంగాన్ని కాపాడేపని చేయ లేరా? రోజుకు పది అబద్దాలాడమని రాముడేమైనా కలలో కనబడి మోడీకి చెప్పాడా? గుజరాత్, మణిపూర్ మారణ కాండలు జరిపించమని ఆ అయోధ్య రాముడే మోడీకి షాలకు కలలో కనబడి ఆజ్ఞాపించాడా? ఒక వేల ఆ దేవుడే ఇవన్నీ జరిపించండని చెప్పి ఉంటే – మణి పూర్లో మహిళల్ని నగంగా ఊరేగించమని చెప్పిఉంటే- ఈ దేశ ప్రజలు ఆ దేవుణ్ణీ, ఈ ప్రభుత్వాన్నీ తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు.
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త (మెల్బోర్న్ నుంచి)
– డాక్టర్ దేవరాజు మహారాజు
Comments
Post a Comment