దేవుళ్లు ఏది చెప్పినా, ఏది చేసినా ఒప్పుకోవాలా?
------------------------------------
రాముడు దేవుడు కాదు.. రాముడు నేను దేవుణ్ణని ఎక్కడా చెప్పలేదు.. వాల్మీకి రామాయణంలో.. రాముడు దేవుడని మనకు ఎక్కడా చెప్పలేదు..
రాముడు నేను మనిషినిరా బాబూ అన్నాడు.. రాముడు(రాజు) నేను మనిషిని.. నాతండ్రి గారు దశరథ మహారాజు.. మా పట్టణం అయోధ్య పట్టణం అన్నాడు.
శ్రీకృష్ణుడు దేవుడు కాదు.. శ్రీకృష్ణుడు కూడా
మాది గోకులం, మధురానగరం అన్నాడు. , భారతంలో భాగవతంలోఅదే ఉంది.అదే రాసి ఉంది.అంతేగానీ రాముడు దేవుడు కాదు.. కృష్ణుడు దేవుడు కాదు.రాముడు మనిషే.. కృష్ణుడు(రాజు) కూడా మనిషి ఎక్కడా కూడా వీళ్ళు దేవుళ్ళు అని చెప్పలేదు..
వారిని దేవుళ్ళుగా చిత్రీకరించడం, మనల్ని (ప్రజలను) పిచ్చివాళ్లను చేసి వివిధ రకాల పూజలను,యజ్ఞాలను, యాగాలను, రాళ్లను దేవతా విగ్రహాలుగా చెక్కించడం, మొక్కించడం మధ్య దళారీల పని మాత్రమే.
మత గ్రంధాలలోని పాత్రలే దేవుళ్ళుగా ఈ రోజుల్లో పూజిస్తున్నారు వారు చెప్పినవన్నీ ఆచరించినవన్నీ
ప్రస్తుతం ఈ సమాజానికి పనికిరావు.
వారు చెప్పినవన్నీ ఆచరిస్తే కటకటాల వెనుక ఉండాల్సిందే. ప్రస్తుత సమాజంలో ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకోవడం నిషేధం.
పురాణాలలో మాత్రం కృష్ణుడికి 8 మంది భార్యలతో సహా ఎన్నో వేలమంది, అలాగే శివుడికి ఇద్దరు.....ఇలాంటివన్ని మనం ఆచరిస్తే రాజ్యాంగ ప్రకారం మనల్ని కటకటాల వెనక్కి తోసేస్తారు. మన పురాణాలలో మహాభారత కథలో ద్రౌపది ఐదుగురిని భర్తలను పెళ్లాడింది అది ఈ కాలానికి తప్పుగా పరిగణిస్తారు. అలా చేసుకుంటే బరితెగించింది అంటారు.
ఒక మతంలో ఒక దేవుడు
"ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అన్నాడు.
సమాజంలో ఎన్నో అవకతవకలు జరుగుచున్నవి. స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నవి.
పసి పిల్లలపై అఘాయిత్యాలు చేసి,సజీవ దహనం చేసినా ఎందుకు రావడం లేదు? మోసకారులు మోసాలు చేస్తూనే ఉన్నారు.నేరాలు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇంకెన్ని ఘోరాలు జరగాలి! ఇంకా ఎంతమంది బలి కావాలి!!
ఎప్పుడు వస్తాడు దేవుడు? సమాజం మనుషులను కదిలిస్తే ఇది కలికాలం అందుకే ఇలా జరుగుతున్నది అంటారు. ఇవన్నీ తప్పనిసరి జరగాలని ఉన్నట్టు.
కొందరు ప్రజలు యుగాల మాయలో దేవుళ్ళమాయలో పడి ఇలా మాట్లాడతారు. యుగాలు లెక్క పచ్చి అబద్ధాలు జీవపరిణామ సిద్ధాంతానికి యుగాల లెక్క పూర్తిగా వ్యతిరేకం. యుగాలకు దానికి పొంతన కుదరదు.
పురాణాలు చెప్పినట్టుగా బహుభార్యత్వం, వ్యభిచారము దేవుళ్ళు చెప్పినట్టుగా, చేసినట్టుగా ప్రస్తుత సమాజంలో ఆచరిస్తే విలువ ఉండదు. సమాజం సూటిపోటి మాటలతో బాధిస్తుంది.
అలా ఎవరు చేయడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుత మన భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రిందివి నేరాలుగా పరిగణిస్తారు.
ఉదాహరణకు:
సతీ సహగమనం, బహుభార్యత్వం, మహిళల పట్ల వివక్షత, బాల్య వివాహాలు, దేవదాసీ, బానిసత్వం, జంతుబలులు మొదలగునవి.
అయినను కొన్ని అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నాయని వింటున్నాం. కొన్ని రోజుల తర్వాత అవన్నీ ఆగిపోతాయి. మూఢత్వం
మూర్ఖత్వం ఆగిపోతాయి.
గురజాడ వారు అన్నట్టు................... "మతములన్నియు మాసి పోవును,
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును"
మన దేవుళ్లు చేసారు కనుక ....మనం కూడా చేయవచ్చని ఎవరూ వాదించడానికి అవకాశం లేదు. మన దేవుళ్లు ఏది చేసినట్టు చెప్పినా... ప్రశ్నించకూడదు అనటం కూడ రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్ఛను అడ్డుకునే నేరమే. అసలు దేవుడే లేనిది దేవుడు చెప్పినట్టుగా గ్రంధాలు రాయటం ఏమిటి?
ఇదంతా కొందరు మోసకారులు చేసిన దుష్టపన్నాగం.ఏ దేవుడు లేడు ఏ దయ్యం లేదు ఎవరు చెప్పలేదు. మధ్య దళారీలు దేవుని పేరు చెప్పి దోచుకోవడానికి తప్ప మరేం కాదు.
అసలు దేవుళ్లు ఇలాంటి పనులు చేయడం ఏమిటీ? ఇలాంటి పనులు చేసిన వాళ్ళు దేవుళ్లు ఎలా అవుతారు? లాంటి ప్రశ్నలు చార్వాకుల కాలం నుంచి ఇప్పటివరకు వినవస్తున్నవే. ప్రస్తుత సమాజంలో కూడా ఎందరో ప్రశ్నించేవారు ఉన్నారు.భవిష్యత్తులో కూడా ఎందరో ప్రశ్నించే వారు పుడతారు.ప్రశ్నకు చావు లేదు ప్రశ్నించే వారిని చంపివేయవచ్చు.కానీ ప్రశ్నను చంపలేరు.
పురాణాలు, గుడులు, దేవుడు, పూజ, భక్తి అనే సంసృతి ఎవరికి భౌతికంగా ఉపాదినిస్తుంది?
భక్తి మూఢత్వం కారణంగా అందరూ తన సహజ సిద్దమయిన విచక్షణను కోల్పోతున్నారు? యజ్ఞ యాగాదులు చేయడం వలన, ఎవరికైనా ఐశ్వర్యము కలిగిందా? ఎవరి కష్టాలన్నా వాటితోనే తీరాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయడమే ' హేతుబద్ధ ఆలోచన ' అంటారు.
అలా కాకుండా 'మా తాతల నాటి నుంచి ఉన్న మా ఇంటి బావి కలుషిత నీటినే నేనూ త్రాగుతాను' అనే వాదన చేసే వారు... మన పూర్వీకుల మాదిరి ' కలరా ' లాంటి వ్యాధులతో చనిపోవడానికి సిద్దపడాలి.
అంతిమంగా... మన జీవన శైలి రాజ్యాంగం ప్రకారం మార్పులు చెందుతుంది కానీ.... పురాణ కథల నుంచి కాదు. సైన్స్ ను బట్టి సమాజం అభివృద్ది చెందుతుంది కాని... మత ప్రబోధకులు చెప్పే ఆచరణీయం కాని మాటలతో కాదు.
ఆధ్యాత్మికతకు, భక్తికి, మతోన్మాదానికి, మూఢనమ్మకాలకు తేడా తెలియక....మతం, ఆచారాలు, దేవుళ్ల పేరుతో చెపుతున్న విషయాలను గుడ్డిగా అనుసరించడం అంటె... సైన్స్ నుంచి నేర్చుకున్న చదువు సంస్కారాలకు సమాధి కట్టుకొవటమే. మనిషిగా ఆలోచించనట్టే.
అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం.
Comments
Post a Comment