9వ శతాబ్దం చోళ రాజుల పాలన వరకు ఏ రాజు కూడా ఈ దేశంలో బ్రాహ్మణ మతం ఉందని వైదిక లేదా హైందవ లేదా హిందూ దేవి దేవతల కోసం మందిరాలు నిర్మించామని వారికి సహాయ సహకారాలు అందించామని ఎక్కడ కూడా శాసనాలు రాయించలేదు.. మెజారిటీ శాసనాలన్నీ బౌద్ధానికి సంబంధించినవి ఉన్నాయి..
అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులు
మొగస్థనీస్ క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం..
పాహియాన్ క్రీస్తు శకం మూడో శతాబ్దం..
6,7 శతాబ్దాల మధ్యన చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్
ఇలా చెప్పుకుంటూ పోతే 11వ శతాబ్దం అరబిక్ రచయిత "అల్బరుని" వరకు..ఎవరూ కూడా వారి గ్రంథాలలో బ్రాహ్మణ మతం ఉందని ఎక్కడ రాయలేదు..
అశోకుడు 84 వేల స్థూపాలు నిర్మించిన ఎక్కడ కూడా బ్రాహ్మణ మతం ఉందని చెప్పలేదు..
ప్రపంచంలో ఎక్కడైనా చరిత్రను అంచనా వేయాలంటే నిర్మాణాలు శిలాశాసనాలను బట్టి అవి ఏ కాలం నాటివో అంచనా వేస్తారు.. ఈ విషయం చరిత్రకారులకు కూడా తెలుసు.
ఇక భాష మరియు వేద గ్రంథాల విషయానికి వస్తే..సంస్కృత భాష 10వ శతాబ్దం నుండే కనబడుతుంది..
వేదాలు చారిత్రకమైనవి పురాతనవి అయితే
ఆ వేదాలలో బుద్ధుని ప్రస్తావన ఎందుకు ఉంది..?
ఆ వేదాలలో అక్బరు బాబరు ప్రస్తావన ఎందుకు ఉంది..?
ఆ వేదాలలో బ్రిటిష్ రాణి విక్టోరియా గురించి ప్రస్తావన ఎందుకు ఉంది..?
ఇవన్నీ చరిత్రకారులకు రచయితలకు తెలియవా..?
అయితే విచిత్రం ఏమిటంటే.. మనదేశంలో కొందరు రచయితలు చరిత్రకారులు.. పురావస్తు శాఖలో పనిచేసిన అధికారులు.. ఆర్యుల దండయాత్ర జరిగిందని.. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం నుండే బ్రాహ్మణులు వలస వచ్చారని.. పుష్యమిత్ర సుంగ అనే బ్రాహ్మణ రాజు ద్వారా బ్రాహ్మణులు బలపడ్డారని..
గుప్తుల కాలంలో వేదాలు రాసుకున్నారని.. ఆరవ శతాబ్ద నాటికి వైదిక మతం ఈ దేశంలో బలపడిందని చెప్తూ వచ్చారు.. ఇప్పటికి కూడా ఆ వాదనను బలపరుస్తూనే ఉన్నారు.. ( కొందరు మాత్రమే )
వైదికులు చెప్పారంటే ఒక అర్థం ఉంది వారి మతాన్ని బలపరచడానికి చెప్పినారు అనుకోవచ్చు..
మరి చరిత్రకారులు రచయితలు బ్రాహ్మణ మతాన్ని పురాతనమైన మతముగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది..? నాకు సమాధానం కావాలి..
నేనేమైనా పొరపాటు పడుతున్నానా.. నేను అడిగిన ప్రశ్నలు తప్పా..తప్పయితే సరి చేసుకుంటాను..మీ బండపల్లి శివారెడ్డి 🙏
Comments
Post a Comment