Mr. Chiranjevulu T, IAS
Telangana
యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన ఆర్యోక్తి. స్త్రీని దేవత గ పూజించే సంస్కృతి కేవలం మన హైందవ సంప్రదాయంలోనే ఉన్నది. కాశ్మీర్ లో లలితాంబ గ ,కన్యాకుమారిలో కాత్యాయిని అమ్మవారు గా, అస్సాంలో కామాక్య దేవత గ ,గుజరాత్ లో అంబాజీ మాత గా దేశం లోని వివిధ ప్రాంతాల లో వివిధ శక్తి రూపాలలో లో స్త్రీ ని పూజిస్తాము. కానీ కాలక్రమేనా "నస్త్రీ స్వాతంత్ర్య మర్హతే" అనే మనుధర్మ సూక్తి వాడుకలోకి రావడంతో స్త్రీ పాత్ర వంటింటికి, పిల్లలను కనిపించడానికి, పతి సేవకే పరిమితమైనది. కాలక్రమమైన అనేక దురాచారాలు ముఖ్యము గా సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులకు పెళ్లి నిరాకరణ, నిరక్షరాస్యత, బహు భార్యత్వం, ఆస్తిలో హక్కు లేకపోవడం వంటివి వచ్చి స్త్రీల జీవితాలు దుర్భరము చేసినవి. పాశ్చాత్య విద్య పుణ్యమా అని సమానత్వం, మానవత్వం, మహిళా హక్కులు మరియు సాధికారత , లౌకికవాదం ,సామాజిక న్యాయం అనే భావనలు వ్యాప్తిలోకి వచ్చి వారి జీవితాలలో కొంత వరకు వెలుగులు నింపినవి. భారతీయ సమాజము లొ కరుడు గట్టిన కుల వ్యవస్థ అసమానతలను ఎదురించడం జరిగింది .స్వాతాంత్ర్యనంతరం అనేక చట్టాలు తీసుకొని వచ్చి మహిళల జీవితాలలో స్వేచ్ఛ ,స్వాంత్రత్యాలు ,సమానత్వం ,సమానఅవకాశాలు కల్పించడం జరిగింది. రాజ్యాంగములో కూడా సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం జరిగింది.
అదే విధంగా ధీర తెలంగాణలో మొదటినుంచి వీరవనితలు ప్రధాన పాత్రలు పోషించారు. అనేక ఉద్యమ పోరాటాలలో ముందుండి కధన రంగము లో పోరాడినారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్కలు అందుకు ఉదాహరణలు. అలాగే నిజాం కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలు ముందుండి పోరాడినారు. తెలంగాణ తొలిదశ ,మలిదశ పోరాటాలలో ,మావోయిస్టు ఉద్యమాలలో ఎందరో అసువులు బాసినారు. తెలంగాణ సాంస్కృతిక పండగలు అయిన బతుకమ్మ ,సమ్మక్క సారక్క జాతర మహిళా సాధికారికతతో కూడు కొని ఉన్నవె .అలాగె తెలంగాణ లో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 18.48 లక్ష ల కుటుంబాలకు మహిళలే కుటుంబ పెద్దలు . 63లక్షల మహిళలూ స్వయం సహాయక సంఘాలలో సభ్యులు మరియు గత సంవాస్తరం 18000 కోట్ల బ్యాంకు రుణాలూ పొందారు ఇప్పటి వరకు లక్ష కోట్ల బ్యాంకు రుణాలు పొందారు. ఇందులో 60 % బిసి మహిళలే .ఇంత చారిత్రక నేపథ్యం , ఆర్థిక పట్టు ,నాయకత్వ లక్షణాలు ,సోషల్ కాపిటల్ ఉన్నప్పటికీని చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యం నామ మాత్రమే. అందులో బీసీ మహిళల పాత్ర మరి దయనీయము. ఈ క్రింది పట్టిక చూసినట్లయితే గత 16 సార్లు జరిగిన మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మొత్తం 95 మంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెడితే బీసీ మహిళలు కేవలం 4 గురు మాత్రమే ఉండగా,మొత్తంగా 8సార్లు అడుగు పెట్టడం జరిగింది.
పట్టిక
attached
1. శ్రీమతి సంగెం లక్ష్మి భాయి యాదవ బాన్సువాడ 1952 INC
2. శ్రీమతి k ఆనందాదేవి ముదిరాజ్ 1962 CPI
3. శ్రీమతి మూసాపేట కమలమ్మ యాదవ , నకిరేకల్, 1972 INC
4. శ్రీమతి కొండ సురేఖ పద్మశాలి ఇంక్1989,1994,2009,2014,2023
మధ్యంతర ఎన్నికలలో మరో ముగ్గురు బిసి మహిళలు శాసనసభలో అడుగు పెట్టారు. వారు
1) శ్రీమతి గడ్డం సుశీల దేవి రాజారాం బాల్కొండ నుండి, 2) శ్రీమతి కొమిరెడ్డి జ్యోతి ,మెట్పల్లి నుండి, 3) శ్రీమతి ఆకుల లలిత ,నిజామాబాద్ రూరల్ నుండి . ముగ్గురు మునురు కాపు కులానికి చెందిన వారే.
మొత్తం 95 మంది లొ 54ఓసి మహిళలు ,16ఎస్సీ మహిళలు ,13ఎస్టీ మహిళలు ,8 బి సి మహిళలు,4మైనారిటీ మహిళలు ,ఇప్పటివరకు శాసనసభకు ఎన్నికైనారు. కానీ 52 శాతము జనాభా ఉన్న బిసిలు ,అందులో సగభాగము మహిళలు ఉండగా కేవలం 4 గురు మాత్రమే 8 సార్లూ అసెంబ్లీలో అడుగు పెట్టినారు. మెజార్టీ జనాభా కలిగిన కులాలైన గౌడ ,కురుమ ,కులాల నుంచి ఒక్క మహిళ కూడా నేటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.
అలాగె లోకసభ లో 12 మంది మహిళా సభ్యులు 20 సార్లూ అడుగు పెట్టగా అందులో బి సి మహిళా ఒక్కరే సంగెం లక్ష్మి భాయి యాదవ గారూ.
శ్రీమతి విజయ శాంతి గారి ఓ బి సి అని నిర్ధారణ గాలేదు.
అలాగే రాజ్యసభలో గుండు సుధ రాణి గారు ఒక్కరే.( పై పట్టిక లభ్య మైన సమాచారం ప్రకారంతయారు చేయబడినది)
స్థానిక సంస్థలలో పంచాయతీరాజ్ చట్టం 1994 ద్వారా 33% రిజర్వేషన్ మహిళలకు అమలవుతుంది. మహిళల రాజకీయ భాగస్వామ్యం పెంచడానికి కేంద్రం 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోకసభ, శాసనసభలలో 33% రిజర్వేషన్ కల్పించినది. ఇది ముదావహం . అందులో ఎస్సీ మరియు ఎస్టీ మహిళలకు వారి కోటాలో సబ్ కోట 33% ఉంటుంది. మిగతా జనరల్ కోటాలో ఉంటుంది. ఈ జనరల్ కోటాలో బీసీ మహిళలకు సబ్ కోట లేకపోవడం వలన బిసి మహిళలు ఉపయోగించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఈ కారణం చేత కేవలం అగ్రవర్ణ మహిళలే ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వేషన్ విషయంపై గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరత్ యాదవ్ ఓబిసి మహిళలకు సబ్ కోట లేకపోవటం వలన మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారు. ఈసారి కూడా ఓబీసీ మహిళలకు, ముస్లిం మైనార్టీ మహిళలకు రిజర్వేషన్లు లేకపోవడంపై ఇద్దరూ ఎంఐఎం ఎంపీలు ఈ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఓటు వేసినారు. నిజానికి, 1996 లో ప్రధాన మంత్రి గా ఉన్న శ్రీ దేవ గౌడ గారు మహిళా బిల్లును ప్రవేశ పెట్టి గీతా ముఖర్జీ కమిటీ ని వేయగా ఆ కమీటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత కాలము లో ఆ బిల్లు
ఆమోదంపొందకపోవడముతో వీగి పోయింది .ఈ మహిళా రిజర్వేషన్లు 2027 లో నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029 నుంచి అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. కానీ ఓబీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం వలన నామమాత్రంగా ఉన్న ఓబీసీ లు లోకసభ, శాసనసభ సభ ల లొ ఇంకా తగ్గుతారు. ఈ దేశం లో ఓబీసీలకు మరోసారి తీరని అన్యాయం జరగ బోతుంది.
ఓబీసీ మహిళా సాధికారత, ఓబీసీ మహిళ రాజకీయ భాగస్వామ్యం లేకపోతే సమ సమాజము ,పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. జనాభాలో ఓబీసీ మహిళలు 26% . వారికి చట్టసభలలో స్థానం లేనిచో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారటం అసాధ్యం. కొంతమంది మహిళలు స్థానిక సంస్ధలలో రిజర్వెషన్స్ పుణ్యమాఅని జిల్లా పరిషద్ చై పర్సన్స్ గా పని చేసినారు. వారూ ఆర్థికంగా బాగానే వున్నారు కానీ కేవలం బిసిలనే నెపమూ తో ఎలక్షన్స్ ల లో ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్స్ ఇవ్వటంలేదు.
ముస్లిం దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ లలో వారి చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం 20 శాతం ఉంది కానీ భారతదేశంలోని లోకసభలో 542 మధ్యలో కేవలం 78 మంది మహిళలు ఉన్నారు అంటే 14.6%మాత్రమే ఉన్నారు.
జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ 193 దేశాలలో భారత్ ప్రపంచంలో 108 స్థానంలో ఉంది .నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కలిగిన ఈ సామాజిక వ్యవస్థలో అట్టడుగు వర్గాల మహిళలకు రాజ్యాధికారం లేనిచో అది అనేక సామాజిక,ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది.పాలన లో వారికి బాగా స్వామ్యం లేనిచో అది ప్రజా స్వామ్య పాలన అన బడదు . ఇప్పటి కైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఓ బి సి లకు అదే విధంగా ఓ బి సి మహిళలకూ రిజర్వేషన్లు కల్పించాలి . Congress party 2024 లోని తన మేనిఫెస్టో లోని పంచ్ న్యాయ్
లో ఒబిసి లకు
మరియుఓ బి సి
మహిళలకు ,చట్ట సభలలో
రిజర్వేషన్స్ ప్రకటించలేదు
ఓ బి సి సంఘాలు , సివిల్ సొసైటీ సంస్థలూ అందుకు పోరాడాలి . ప్రభుత్వము పై ఒత్తిడి పెంచాలి , జాతీయ ఉద్యమాలు నడపాలి. ఓబిసి వ్యతిరేక పార్టీలకు
ఓటు వేయకూడదు వాటికీ మన బల మేమిటో చూయించాలిన్సిందే లేనిచో ఓ బి సి లు ఈ దేశము లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలిన్సిందే .
(సోదరి శ్రీ మతి మణి మంజరి అద్వర్యంలో బిసి మహిళా సంక్షేమ సంఘం ఈమద్య కాలము లో ఓబీసీ మహిళ ల కు చట్ట సభలలో 1/3 వంతు రిజర్వేషన్స్ కావాలని ఒక సదస్సు నిర్వహించినారు ఆ సందర్భంగా తయారు చేయ బడినిది. అందుకే వారికి అంకితం
Comments
Post a Comment