మనదేశంలో 90 శాతం మంది ప్రజలు "భ్రమ"లో బతుకుతున్నారు. ఎవరో చెప్పిన మాటలను విని వాస్తవాలు ఆలోచించక, తెలుసుకోలేక భ్రమలో బతుకుతున్నారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్న ట్టుగా కపట వేషధారులైన స్వామీజీలు, బాబాలు చెప్పిన మాటలు విని, తలలూపుతూ వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారు.ఆర్థికంగా నష్టపోతున్నారు. శాస్త్రవేత్తల కన్నా స్వామీజీలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు గౌరవిస్తున్నారు. మనిషి వాస్తవాలను చూస్తూ, వింటూ ఎవరో చెబుతున్నారని మన కంటి ముందు కనిపించని వాటిని కూడా పిచ్చిగా నమ్మేస్తున్నాడు. ఒక్కొక్కసారి భ్రమ పడడం సహజమే. భ్రమ పడినటువంటి విషయము ఒక్కొక్కసారి నిజం కావచ్చు కాకపోవచ్చు అందుకోసం ఈ విషయాన్ని మనం స్వయంగా ప్రశ్నించి,మన జ్ఞానేంద్రియాలతో దానిని పరిశీలించి, ప్రయోగాల ద్వారా సాక్ష్యాధారాల ద్వారా ధృవపరుచుకొని ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవాలి. కొందరు మనం దేవుని బిడ్డలం, దేవునికి జన్మించాము అంటుంటారు. మరికొందరు దేవుడున్నాడని ఆయన మన పాపాలను లెక్కకడుతున్నాడని, పాపాలు ఎక్కువైతే నరకంలోకి పంపిస్తాడని, పుణ్యాలు ఎక్కువైతే స్వర్గం లోకి పంపిస్తాడని చాలామంది అంటుంటారు. కానీ ఇవేవీ నిజాలు కావ...