Chiranjevulu T, IAS Telangana ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన బిసి వర్గాలు తాము అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని ,అగ్రవర్ణాలతో పోటీపడే సమాన అవకాశాలు లభిస్తాయని, తమ జనాభా దామాషా ప్రకారం న్యాయబద్ధమైన వాటా లభిస్తుందని ఆశించారు. స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత విద్య, ఉద్యోగాలు ,స్థానిక సంస్థలలో కాస్తా రిజర్వేషన్లు కల్పించడంతో కొంత మేరకు లబ్ధి చేకూరినప్పటికిని చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడం వలన వారి ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది. ఈ దేశ పరిపాలనలో వారు భాగస్వాములు కాలేకపోతున్నారు. ఎస్సీ మరియు ఎస్టీలకు వారు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లు ఉండడం వలన వారి ప్రాతినిధ్యం కొంతవరకైనా మెరుగుగా ఉంది. జనరల్ సీట్లలో వారు పోటీ చేసి గెలిచిన సీట్లు చాలా తక్కువ. అనాదిగా అగ్రవర్ణాలు వివిధ ధర్మాల ,వాదాల పేరిట సామాజిక న్యాయమును సమాధి చేశారు. మెజారిటీ ప్రజల జీవితాలను బానిస బ్రతుకులుగా మార్చినారు. సంపద ,రాజకీయ అధికారం ఆధిపత్య అగ్రవర్ణాల వారి చేతుల్లో ఉండటం వలన బిసిలు బానిస సంకేళ్ళు తెంపుకోలేక పోతున్నారు. చట్టసభలలో నామమాత్రంగా మిగిలిపోతున్నారు. ఉదాహరణ...